T20 Worldcup: అక్టోబర్ లో మొదలు కానున్న ట్వంటీ-20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి ఉత్సాహాన్ని మరింత పెంచేలా నిన్న విడుదల చేసిన టి20 ప్రపంచకప్ గ్రూపుల్లో భారత్, పాకిస్తాన్ గ్రూప్-2లో ఉండడం గమనార్హం.
కాబట్టి లీగ్ దశలో ఇండియా-పాకిస్తాన్ మధ్య టి20 మ్యాచ్ జరుగుతుంది. 2019 ప్రపంచకప్ తర్వాత భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్ళ నుండి ఇండియా, పాకిస్తాన్ మధ్య మామూలు మ్యాచ్ లు కూడా జరగలేదు కాబట్టి ఈ మ్యాచ్ కోసం భారీ హైప్ ఉంటుంది.
ఇక ఇండియా-పాకిస్తాన్ తో పాటు అదే గ్రూపులో న్యూజిలాండ్, అండర్ డాగ్స్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లతో పాటు క్వాలిఫైయర్ నుండి మరొక రెండు జట్లు బలమైన జట్లతో పోరాడేందుకు వస్తాయి. మొదటి గ్రూపులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఒకదానితో ఒకటి పోటీ పడనున్నాయి. ఇలా రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు సెమీఫైనల్స్ ఉంటుంది.
ఇక భారత్, పాకిస్తాన్ కనుక రెండవ గ్రూప్ నుండి సెమీఫైనల్స్ కి క్వాలిఫైడ్ అయితే. ఫైనల్స్ లో కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. అప్పుడు టోర్నీ కి హైప్ మరింత పెరుగుతుంది. 2020 ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియాలో జరగాల్సిఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడి 2021 లో టి20 ప్రపంచ కప్ భారత్లో జరిపేందుకు కూడా వీలు పడలేదు. కాబట్టి అక్టోబర్లో యూఏఈ, ఓమన్ లో పొట్టి ప్రపంచ కప్ ను నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయించింది.