Android games: టెక్నాలజీ రోజు రోజుకీ రూపాంతరం చెందుతుంది. దానికి తగ్గట్టుగానే సదరు కంపెనీలు అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గేమింగ్ ప్రపంచం రోజు రోజుకీ విస్తరిస్తోంది. నేటి యువత గేమ్స్ పైన చూపిస్తున్న ఇంటరెస్ట్ ని కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. దానికి అనుగుణంగానే వివిధ రకాల కాన్సెప్ట్ లతో కంపెనీలు మార్కెట్లో దూసుకు పోతున్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం (2021) మరిన్ని కొత్త కొత్త గేమ్స్ మార్కెట్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించాయి.
ఇపుడు పాపులర్ గేమ్స్ గురించి తెలుసుకుందాం:
ఈ ఏడాది యూజర్లు ఎక్కువగా ఇష్టపడ్డ గేమ్స్ జాబితాను గూగుల్ ప్లే స్టోర్ తాజాగా రిలీజ్ చేసింది. జనాదరణ పొందిన గేమ్స్కు అత్యుత్తమ అవార్డులను ప్రకటించడం విశేషం. అందులో మొదటిది ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా.’ 2021కు గాను భారత్ లో ఆడే అత్యుత్తమ గేమ్ గా ఇది ఎంపిక అయింది. క్రాఫ్టాన్ తీసుకొచ్చిన ఈ ‘బ్యాటిల్ రాయల్ గేమ్ BGMI’ టాప్లో నిలవడం కొసమెరుపు. అలాగే యూజర్స్ చాయిస్ లో భాగంగా ‘గరేనా ఫ్రీఫైర్ మ్యాక్స్ గేమ్” టాప్ గేమ్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎక్కువ మంది యూజర్లు దీనికే ఓటేశారు.
టాప్ 2 గేమ్స్ గురించి తెలుసుకుందాం:
‘స్ట్రాటెజీ గేమ్ సమనర్స్ వార్: లాస్ట్ సెంచూరియా… ‘టాప్-2 స్థానాన్ని నిలదొక్కుకొని తన ఉనికిని చాటుకుంది. ఇక బెస్ట్ కాంపిటేటివ్ గేమ్స్ విభాగంలో చాలా గేమ్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ముఖ్యంగా వీటికే ఓటేసి గెలిపించారు. సదరు కంపెనీలు యూజర్స్ ఫ్రెండ్లీని దృష్టిలో పెట్టుకొని వీటిని రూపొందించడం వలన ఈ ఘనత దక్కింది. గూగుల్ కి సోషల్ మీడియా వేదికగా సో కాల్డ్ కంపెనీలు కృతజ్ఞతలు తెలియజేశాయి. అక్కడితో ఆగకుండా నెక్స్ట్ ఇయర్ కూడా తాము సత్తా చాటుతామంటూ తెలియజేసారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?