ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహార విషయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కార్బ్స్ చక్కెరలను మన శరీరం గ్లూకోజ్ గా మార్చుకొని శక్తిని విడుదల చేస్తుంది. మనం పౌష్టికాహారం తీసుకున్నప్పుడు మన శరీరానికి సరిపడా ఇన్సులిన్ క్లోమం ఉత్పత్తి చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు మన శరీరంలో అధిక శాతం ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది దీనివల్ల నీరసం, ఆకలి ఎక్కువగా ఉండటం, అధిక రక్తపోటు, మన పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు బయటకు కనబడకుండా టైప్ 2 డయాబెటిస్ కి దారి తీస్తుంది.
డయాబెటిస్ ప్రస్తుతం ఈ కాలంలో అధికంగా వినిపిస్తున్న సమస్య. ప్రతి 10 మందిలో దాదాపు ఎనిమిది మంది ఈ డయాబెటిస్ బారినపడి ఉంటారు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా చక్కెర స్థాయిలు ఉండటం వల్ల అధిక బరువు పెరగడంతోపాటు ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి పురుషుల కన్నా మహిళలలో అధికంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది.
మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు అధికంగా ఉండటం వల్ల చాలామంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడే వారు శరీర బరువు పెరిగి వారిలో అధిక రక్తపోటు రావడమే కాకుండా, గుండెకు సంబంధించిన టువంటి వ్యాధులు తలెత్తుతున్నాయి. ఎనర్జీ డ్రింక్స్, షోడా లాంటి పదార్థాలలో చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
ఒబెసిటీ, టైప్-2 డయాబెటీస్ అనేవి కాగ్నినివ్ డిక్లైన్, డెమెన్షియా, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దారితీస్తాయి. వీటి నుంచి విముక్తి పొందాలంటే మనం తీసుకునే ఆహార పదార్థాలలో చక్కెర శాతం తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధులకు దూరం కావొచ్చు. మన ఆహార విషయంలో కొంతమేర జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.