ఈ మధ్య కాలం లో చిన్న నొప్పి వచ్చినా కూడా వెంటనే ట్యాబ్లెట్లను వాడేస్తున్నారు. టాబ్లెట్ అయితే వేసుకుంటారు కానీ చాలా మందికి ట్యాబ్లెట్లను ఏ ఏ పదార్థాలతో వేసుకోవాలో తెలియదు. కాఫీ తాగుతూ,టీ తాగుతూ లేదా జ్యూస్ లు తాగుతూనో ఇలా రకరకాల ద్రవపదార్ధాలతో ట్యాబ్లెట్లను వేసేసుకుంటార. అయితే ఒక్కొక్కసారి తెలియక చేసే ఆ చిన్న పొరపాటులే ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. మరి ట్యాబ్లెట్లనువేసుకునేటప్పుడు వేటిని ఉపయోగించాలో తెలుసుకుందాం.
చల్లగా ఉన్న నీటి తో ట్యాబ్లెట్లనువేసుకున్నప్పుడు . ట్యాబ్లెట్స్ సరిగ్గా కరగవు.అప్పుడు ట్యాబ్లెట్లలో ఉండే మందును శరీరం గ్రహించదు. ఫలితం గా టాబ్లెట్ వేసుకున్నాకూడా అనారోగ్యం నయం కాదు. కనుక ఎవరైనా ట్యాబ్లెట్లను వేసుకోవాలనుకున్నప్పుడుతప్పని సరిగా గోరు వెచ్చని నీరు లేదా గది ఉష్ణోగ్రత లో ఉన్న నీటి నే తాగాలి. దీని వల్ల ట్యాబ్లెట్ లోపల త్వరగా కరిగిపోతుంది.
టీ తాగుతూ ట్యాబ్లెట్లను వేసుకోకూడదు. దానికి గల కారణం పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్ మందుల ప్రభావాన్ని బాగా తగ్గేలా చేస్తుంది. అదేవిధంగా ద్రాక్ష రసం తో కూడా ట్యాబ్లెట్లను వేసుకోకూడదు. ఎందుకంటే..ద్రాక్షరసంలోని ఎంజైములు ట్యాబ్లెట్ల ప్రభావాన్నిపూర్తిగా తగ్గించేస్తాయి. దీని కారణం గా అనారోగ్యం తగ్గదు. ఇది మాములు టాబ్లెట్స్ ప్రభావాన్ని కూడా పెంచి హానికరంగామారుస్తుంది.
మామిడిపండు పీచు తో కూడిన పళ్ళరసాలు, కూరగాయలు పళ్ళు కలిపి తీసిన పళ్ల రసాల తో ట్యాబ్లెట్లను వేసుకోకూడదు. ఇలా వేసుకోవడం వల్ల బీపీ, షుగర్ వంటి మందులు పనిచేయవు. పండ్లరసాలు ఔషధ గుణాలను తగ్గించి, ఆరోగ్య సమస్యలపై ఎలాంటి ప్రభావ చూపకుండా చేస్తాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తపోటు, హృద్రోగాల బారినపడ్డవారు నీటి తో మాత్రమే టాబ్లెట్స్ వేసుకోవాలని సూచిస్తున్నారు. కాబట్టి టాబ్లెట్స్ వేసుకునే టప్పుడు జాగ్రత్తలు పాటించాలి అని నిపుణులు సూచిస్తున్నారు.