Talaivi : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో రూపొందిన బయోపిక్ చిత్రం ‘తలైవి’. తమిళ ప్రేక్షకులు, సినీ అభిమానులు ‘పురచ్చి తలైవి’గా పిలుచుకునే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీ నటి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఎ.ఎల్. విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ తో పాటు ట్రైలర్, సాంగ్ కి అభిమానుల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియన్ రేంజ్లో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు.
ఇక ఈ క్రేజీ బయోపిక్ ను ఏప్రిల్ 23న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. తీరా రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి ఈ సినిమాకి కరోనా సెకండ్ వేవ్ తాకిడి తగిలింది. దాంతో తప్పని పరిస్థితుల్లో వాయిదా పడింది. కాగా తాజాగా చిత్ర బృందం ‘తలైవి’ సెన్సార్ కార్యక్రమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ను ఇచ్చారు. ఈ సినిమా తమిళ వెర్షన్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. సెన్సార్ బోర్డ్ వారు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా..త్వరలో తెలుగు అండ్ హిందీ వర్షన్ కి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ రానుందని చెప్పారు.
Talaivi : కంగనా ఈ సినిమాతో ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
ఇక ఈ సినిమాకి ‘బాహుబలి’ చిత్ర రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. తమిళ రాజకీయాలను జయలలిత ఎలా శాసించగలిగారు.. ‘అమ్మ’ గా ఎలా ఎదిగి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు, ఆమెకు ఎంజీఆర్ కు మధ్య ఉన్న ప్రేమానుబంధం, సాన్నిహిత్యం ఎలా ఉంటుంది వంటి ఆసక్తికరమైన విషయాలను తలైవిలో చూపించబోతున్నాడు దర్శకుడు ఏ.ఎల్.విజయ్. కాంట్రవర్సీలతో నిరంతరం వార్తల్లో నిలిచే కంగనా ఈ సినిమాతో ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.