మిల్క్ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటింది. ఈ ముద్దుగుమ్మ పాలుగారే సొగసులతో ఎంతోమంది కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. తన నటనాభినయంతో ఎంతోమందిని అభిమానులను చేసుకుంది. మంచు మనోజ్ సరసన శ్రీ అనే మూవీతో నటించి టాలీవుడ్కి పరిచయం అయింది. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు అందరి సరసన నటించి రికార్డ్ సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి-సైరా, పవన్ కళ్యాణ్-కెమెరామెన్ గంగతో రాంబాబు, వరుణ్-ఎఫ్3, రామ్ చరణ్-రచ్చ, అల్లు అర్జున్-బద్రీనాథ్ ఇలా మెగా హీరోలందరితో రొమాన్స్ చేసింది.
భక్తిపారవశ్యంలో తమన్నా
సౌతిండియా సినీ ఆడియన్స్ పై తమన్నా వైరల్ కామెంట్స్..!!
అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువ ఐటమ్ సాంగ్స్లో కనిపిస్తుంది. ఇందుకు ఆమె హీరోయిన్ కెరీర్ ఎండింగ్కి రావడమే ప్రధాన కారణం కావచ్చని తెలుస్తోంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్ని చేజార నివ్వకుండా వచ్చిన ప్రతి ఆఫర్కి ఓకే చెప్తుంది. అలానే ఈ మిల్క్ బ్యూటీ గుళ్ళు, గోపురాలు, శక్తి పీఠాలు సందర్శిస్తూ దైవభక్తిలో మునిగి తేలుతోంది. ఈ హాట్ బ్యూటీ 32 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. తమన్నా షూటింగ్స్ విరామ సమయంలో దైవదర్శనం చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇటీవల హిమాలయ పర్వతాలను కూడా చుట్టి వచ్చింది. ఇటీవల జమ్మూలో మాత వైష్ణవి దేవి ఆలయాన్ని సందర్శించింది. ఇలా ఎందుకని అడిగితే ఆధ్యాత్మికమైన యాత్రలు తనకు మధురానుభూతుల్ని కలిగిస్తున్నాయని చెప్తుంది.
మూడు రోజులే మధురమైనవి
తాజాగా తమన్నా ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుధేవ్కు చెందిన ఈషా యోగ మైదానానికి వెళ్లి ధ్యానం చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఈషా మైదానంలో తాను గడిపిన మూడు రోజులు ఎంతో మధురమైనవని తమన్నా సంతోషం వ్యక్తం చేసింది. ఆరోగ్యపరంగా తాను ఎంతో ప్రయోజనం పొందాలని వెల్లడించింది. ఈ మిల్క్ బ్యూటీ చిరంజీవి సరసన ‘బోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. హిందీలో ప్లాన్ ఏ-ప్లాన్ బి బౌన్సర్ బోలె చుడియాన్ సినిమాల్లో కూడా నటించనుంది. అలానే తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.