Suriya: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు సూర్య నీట్-2021 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేదిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు .ఈ పరీక్ష రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను హరించేదిగా ఉందని కూడా ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.అసలు విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉందని ,దాన్ని రాష్ట్రాలకు బదలాయించాలని కూడా సూర్య గట్టిగా కోరారు.నీట్ పరీక్ష నిర్వహణ విధానం లోపభూయిష్టంగా ఉందని ఆయన అన్నారు.
Suriya: సూర్య ఏం చెప్పారంటే?
“మన దేశంలో ధనిక, బీద తేడాలున్నాయి.ఎవరి స్థాయిని బట్టి వారికి విద్య ,ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి.కానీ నీట్ పరీక్ష నిర్వహణ విధానం ధనిక, పేద విద్యార్థులను ఒకేలా చూసేదిగా ఉంది.నీట్ పరీక్ష ద్వారా విద్యార్థుల అర్హతను ధ్రువీకరించే ఈ విధానం సరైంది కాదు.ఈ విధానంలో విద్యార్థులందరినీ ఒకేలా చూస్తారు.ఫలితంగా తప్పనిసరిగా పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇది సామాజిక అన్యాయమనే చెప్పాలి”అని సూర్య పేర్కొన్నారు.ఇది విద్యార్థులదే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను కూడా నష్టపరుస్తోందని ఆయన వాదించారు.
విద్యారంగం రాష్ట్ర జాబితాలో ఉండాలి!
విభిన్న భాషలు, విభిన్న జాతులు ,విభిన్న ప్రజలు ఉన్న భారతదేశంలో విద్యారంగం ఉమ్మడి జాబితాలో కాకుండా రాష్ట్ర జాబితాలో ఉండాలని సూర్య అన్నారు.అప్పుడే ఆ రాష్ర్టానికి ,అందులో ఉన్న విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని ఆలోచించి రాష్ట్ర జాబితాలోకి విద్యారంగం వచ్చేటట్లు కృషి చేయాలని సూర్య పిలుపునిచ్చారు.
సీఎం అధ్యక్షతన గల కమిటీకి లేఖ!
ఈ విషయాలన్నీ వివరిస్తూ సూర్య ఒక సుదీర్ఘమైన లేఖను జస్టిస్ ఏకే రాజన్ అధ్యక్షతన ఏర్పడిన ఉన్నతస్థాయి కమిటీకి ఇప్పటికే పంపారు.ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేసిన ఈ కమిటీ నీట్ పరీక్ష నిర్వహణ విధానాన్ని అధ్యయనం చేస్తోంది.వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు చేయూత నిచ్చే ఆగారం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ని సూర్య ఎప్పటినుంచో నడుపుతున్నారు.గత ఏడాది కూడా ఆయన నీట్ పరీక్ష నిర్వహణ తీరును తప్పుబట్టగా అది కోర్టు ధిక్కరణ నేరం వరకూ వెళ్లింది.అయిన సూర్య ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ నీట్ పరీక్ష రద్దు చేయాలన్న డిమాండ్ ని ట్వీట్ చేసి తెర పైకి వచ్చారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?