ఏపి సీఎం వైఎస్ జగన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఏపి, తమిళనాడు సరిహద్దులో చిత్తూరు జిల్లాలో ఆనకట్ట నిర్మించడం పై స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా ఆనకట్ట నిర్మాణం ఎలా చేపడతారంటూ స్టాలిన్ లేఖలో ప్రశ్నించారు. కోసస్తల నదిపై రెండు ఆనకట్టల నిర్మాణం జరుగుతోందని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే చెన్నై లో తాగు నీటి సమస్య ఏర్పడుతుందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతంలోనూ భవిష్యత్తులో ఆనకట్ట నిర్మించవద్దని స్టాలిన్ లేఖలో కోరారు. వెంటనే ఆనకట్ట నిర్మాణం ఆపాలని స్టాలిన్ కోరారు.
ఎస్సీ, బీసీ: టీడీపీకి పొలిటికల్ దెబ్బ..! జగన్ వేసిన ఉచ్చు.. టీడీపీకి నష్టం తప్పదా..?
తమిళనాడు సీఎం స్టాలిన్ తో జగన్ కు స్నేహ సంబంధాలు ఉన్నాయి. సీఎం జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టాలిన్ హజరైయ్యారు. జగన్ నివాసం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విందులోనూ స్టాలిన్ పాల్గొన్నారు. ఇటు పక్క పొరుగు రాష్ట్రం తెలంగాణతో నీటి పంచాయతీ కొనసాగుతోంది. ఏపిలోని ప్రాజక్టులపై తెలంగాణ సర్కార్, తెలంగాణలోని ప్రాజెక్టులపై ఏపి సర్కార్ గతంలో కేంద్రానికి, ట్రైబ్యునల్ కు ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. నీటి జగడం విషయంలోనే ఏపి, తెలంగాణ సీఎంల మధ్య స్నేహ సంబంధాలు దూరమైయ్యాయి. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లాలో ఏపి సర్కార్ చేపడుతున్న ఆనకట్టలపై తమిళనాడు సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎన్నికల స్టాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ (పీకే) యే తమిళనాడులో స్టాలిన్ కూ ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు.,
స్పీకర్ నియోజకవర్గంలో జగన్ టీమ్ నిఘా!? మార్పు తప్పదా..!?