బులూచిస్థాన్, జనవరి 22: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది సజీవదహనమయ్యారు.
లస్బెలా జిల్లాలో కరాచీ నుంచి పంజ్గుర్ వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు కిటికీల నుంచి దూకేందుకు యత్నించారు. రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. ప్రయాణీకులు అంతా మంటల్లో చిక్కుకుపోయారు.
ప్రమాదంలో 26 మంది సజీవదహనమైనట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన 16మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.