గతంలో కంటే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆన్ లాక్ ప్రక్రియ మొదలు అయినప్పటి నుండి, కరోనా బలహీన పడింది అనే ఉద్దేశం తో ప్రజలు తగ్గిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది. తక్కువ సమయం లోనే ఒక్కరి నుండి మరొకరికి వ్యాప్తి చెందడంతో, వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయవల్సిన సంఖ్యా అమాంతం పెరగడం వలన కిట్ ల కొరత ఏర్పడింది. దీనితో వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యా గణనీయం గా తగ్గిపోయింది. కొన్ని కరోనా కిట్ లతో చేసిన పరీక్షలలో సరి అయినా ఫలితం తెలియకపోవడం కూడా వ్యాప్తి పెరగడానికి ఒక కారణం. ఈ సమస్య ను నివారించడానికి టాటా సంస్థ కరోనా కిట్స్ ని మార్కెట్ లో ప్రవేశ పెట్టనుంది.
తాజాగా టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ (టాటా ఎం & డి ) కరోనా పరీక్షలు నిర్వహించే కిట్స్ ని లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతం ఉన్న వాటి కంటే మరింత సమర్థవంతంగా, సరి అయినా ఫలితాలని వెల్లడించగలదు అని సంస్థ తెలిపింది. 90 నిమిషాలలో తుది ఫలితం ఇవ్వగల ఈ కిట్ కి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక నెలలోనే 1 మిలియన్ టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని, చెన్నైలో ఉన్న తమ టాటా మెడికల్ ప్లాంట్ కలిగి ఉంది అన్ని సంస్థ సీఈఓ తెలిపారు. ఈ కిట్ ను ప్రవేశ పెట్టడం ద్వారా దేశంలో పెద్ద ఎత్తున పరీక్షలను నిర్వహించగలము అన్ని సంస్థ తెల్పింది. భారతదేశం అంతటా పరీక్ష కిట్ ల ని అందుబాటులోకి తెచ్చేందుకు, సంస్థ హాస్పిటల్స్ తో, డయాగ్నొస్టిక్ సెంటర్స్ తో, లాబొరేటరీస్ తో భాగస్వామ్యం కోసం మాట్లాడుతోంది. ఈ కిట్ ద్వారా పరీక్ష ఫలితాలను మరింత సమర్థవంతంగా, తొందరగా అలాగే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఈ కిట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే సంఖ్యను కూడా పెంచవచ్చు అన్ని, ఇది పూర్తిగా భారతదేశం లోనే తయారు చేసింది గా సంస్థ సీఈఓ గిరీష్ కృష్ణమూర్తి తెలిపారు.
సోమవారం వెలుపడిన గణాంకాలు ప్రకారం భరత్ దేశంలో కరోనా కేసు ల సంఖ్యా 45,903 పెరిగి 8.55 మిలియన్లకు చేరగ్గా, మరణాలు 490 పెరిగి 126,611 సంఖ్యాను చేరుకున్నాయి.