గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే ట్రెండింగ్ వార్తల్లో ఉంది.ఈ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేపులు ఒక్కొక్కటిగా విడుదల అవుతూ సంచలనం రేపుతున్నాయి.
ముందుగా ఆమె ఒక సీఐని దూషించినట్లు, తరువాత ఒక పేకాట క్లబ్ నిర్వహణ విషయమై అనుచరులతో మాట్లాడినట్లు, తాజాగా వైసిపిలో దళిత నేతలకు స్థానం లేదని,పార్టీ లోఅంతా రెడ్డిరాజ్యం నడుస్తోందంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు ఆడియో టేపులు విడుదల కావడం తెలిసిందే.దీంతో ఇబ్బందుల్లో పడిపోయిన ఉండవల్లి శ్రీదేవి ఎలా ఇది జరుగుతోందంటూ ఆరా తీయగా ఆమె నివ్వెరపోయే నిజం ఒకటి బయటకు వచ్చింది.తాడికొండ లో పట్టున్న ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ ఇదంతా చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీదేవి దృష్టికొచ్చింది.రాబోయే ఎన్నికల్లో తన కుమార్తెను తాడికొండలో వైసిపి అభ్యర్థిగా నిలబెట్టే పకడ్బందీ ప్రణాళికలో భాగంగా ఆయన ఇదంతా చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి గూఢచారులు సమాచారం పోగేశారట.
నిజానికి శ్రీదేవికి తాడికొండ కే చెందిన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ బాబుకు మధ్య తొలుత విబేధాలు ఉండేవి.అయితే పార్టీ అధిష్టానవర్గం వారిద్దరి మధ్య సఖ్యత కుదిర్చింది.ప్రస్తుతం వారి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి.కాని శ్రీదేవిపై రోజూ ఏదో ఒక రీతిలో బురద పడుతూనే ఉంది.దీన్ని ఆమె సీరియస్గా తీసుకుని తనదైన శైలిలో స్పైయింగ్ చేసేసరికి దీని వెనక సదరు ఎమ్మెల్సీ ఉన్నట్లు వెల్లడైందట.దీంతో ఉండవల్లి శ్రీదేవి కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది.శ్రీదేవి వర్గీయులు తాజాగా సోషల్ మీడియాలో ఆయనను టార్గెట్ చేస్తున్నారు.
పార్టీ మారి వచ్చిన తాతయ్యా అంటూ పరోక్షంగా పోస్టులు పెడుతూ కౌంటర్లు ఇవ్వడంతో పాటు గతంలో సదరు నేత చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు. ఈ తాతయ్య చాలా డేంజర్, నమ్మొద్దంటూ కౌంటర్ ప్రచారం చేస్తున్నారు. నీ వాయిస్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయ్ తాతయ్యా ? త్వరలోనే వాటిని బయట పెడతాం అంటూ సోషల్ మీడియాలో ఆ ఎమ్మెల్సీకి హెచ్చరికలు కూడా చేస్తున్నారు.మొత్తం మీద తాడికొండ రాజకీయం తస్సాదియ్యా అనే రీతిలో ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?