ఇండియన్ సాఫ్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది. కరోనా సమయంలో కూడా భారీ ఎత్తున ఫ్రెషర్స్ ను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. గత ఏడాది 40వేల మంది ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకున్నామని ఈ ఏడాది కూడా అదే సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. ఆ ఆర్ధిక సంవత్సరంల మొదటి త్రైమాసికంలో సంస్థ ఆదాయం తగ్గినా ఈ నిర్ణయం తీసుకోవటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
ఇదే ఆర్ధిక సంవత్సరంలో అమెరికా క్యాంపస్ కూడా 2వేల మంది ఉద్యోగులను తీసుకుంటామని కూడా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్1బీ, ఎల్1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించింది టీసీఎస్.. అందుకే స్థానికంగానే ఉద్యోగులకు తీసుకునేందుకు సిద్ధమైంది. అమెరికాలో స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కొత్త కాదని అంటోంది. 2014 నుంచి ఇప్పటివరకూ అమెరికా క్యాంపస్ లోనే దాదాపు 20వేల మంది స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకున్నామని సంస్థ ప్రకటించింది. టాప్ 10బీ స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్స్ ను కూడా తీసుకుంటామని సంస్థ అంటోంది.
గతేడాది నియమించుకున్న వారిని ఈనెల ప్రారంభం నుంచి ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నట్టు ప్రకటించింది. శిక్షణలో 87మంది యాక్టివ్ గా ఉన్నట్టు కూడా ప్రకటించింది. ఆన్ లైన్ ద్వారా ప్రతివారం 8వేల నుంచి 11వేల మందిని ఆన్ లైన్లో రిక్రూట్ చేసుకుంటున్నట్టు తెలిపింది. మరో 100 మంది ఎక్స్ పీరియన్స్ ఉన్న స్టాఫ్ ను కూడా తీసుకుంటామని ప్రకటించింది టీసీఎస్.