Tdp : రాజకీయాలలో చంద్రబాబు వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని చెబుతుంటారు. వాడుకొని వదిలేయడం లో చంద్రబాబును మించిన వారు మరొకరు ఉండరు అని అంటుంటారు ప్రత్యర్ధులు. టిడిపి పార్టీ క్యాడర్ అదేవిధంగా నాయకులు గురించి చంద్రబాబు ప్రసంగాలు వేదిక కి మాత్రమే పరిమితమవుతాయి అని అంటుంటారు. ఇటువంటి తరుణంలో తాజాగా చంద్రబాబు చేసిన ఒక చిన్న పని పార్టీలో మాత్రమేకాక పార్టీ కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
మేటర్ లోకి వెళ్తే కరోనా దేశంలో ఎంటర్ అయినా తర్వాత చాలా వరకు చంద్రబాబు జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తూ.. ఒకపక్క నాయకులను, మరోపక్క కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు. ఇలాంటి తరుణంలో చిత్తూరు జిల్లాలో కొత్తగా పెళ్లయిన ఒక జంటకి సరికొత్త సర్ప్రైజ్ చంద్రబాబు ఇవ్వటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పూర్తి విషయంలోకి వెళితే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండలానికి చెందిన అశోకన్ కుమారుడు ఆల్బర్ట్ అనే దళిత యువకుడకి టిడిపి పార్టీ సామాన్య కార్యకర్త మరియు చంద్రబాబు కుటుంబం అంటే ఎనలేని అభిమానం. అటువంటి ఆల్బర్ట్ తన వివాహం చంద్రబాబు సమక్షంలో జరుపుకోవాలని తన కోరిక పార్టీ నాయకులకు చెప్పారు.
దీంతో నగరి నియోజకవర్గం టిడిపి పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చంద్రబాబు ఏమాత్రం ఆలోచించకుండా బాను విజ్ఞప్తి మేరకు వివాహ కార్యక్రమంలో చంద్రబాబు జూమ్ వీడియో కాల్ ద్వారా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి వచ్చిన వారు ఈ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చాలావరకూ పార్టీ కార్యకర్తలతో డిస్టెన్స్ మెయింటెన్ అన్నట్టుగా వ్యవహరించే చంద్రబాబు ఈ విధంగా ఓ దళిత యువకుడు అది సామాన్య కార్యకర్త పెళ్లి కోసం తన టైం వెచ్చించడం పార్టీలో మాత్రమే కాక ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఈ వార్తపై విపక్షాలు త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి చంద్రబాబు ఇటువంటి డ్రామాలాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.