తాచెడ్డ కోతి వనమల్లా చెరిచినట్టు తాను భ్రష్టు పట్టడమే కాకుండా చంద్రబాబును కూడా ఆంధ్రజ్యోతి ఆర్కే ఎందుకూ పనికి రాకుండా చేస్తున్నాడని’ టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్కే ఇలాంటి రాతలతోనే బీజేపీకి చంద్రబాబు దూరమయ్యేలా చేశారని, ఆ దూరం భవిష్యత్లో మరెప్పటికీ కలుసుకోలేనంతగా సంబంధాలు తెగ్గొట్టేలా చేయడంలో ఆర్కే ప్రధాన సూత్రధారుడని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.ఆర్కే రాతలను చదువుతుంటే…ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని , ఆయనకు బాగా సన్నిహితంగా తిరుగుతున్న వారే చెబుతున్నారు.ఈ వారం ‘కొత్త పలుకు’ కాలమ్లో ‘వినాశకాలంలో విపరీత బుద్ధులు!’ శీర్షిక కింద ఆర్కే రాసిన వ్యాసం చదివిన వారెవరికైనా ఈ సందేహం రాక మానదన్నారు.ఆ వ్యాసంలో ఉన్న ఒకే ఒక్క పేరా ఆర్కే అసందర్భపు ప్రేలాపన అంటున్నారు.‘జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న నమ్మకం కుదిరాక అవినీతి కేసులలో విచారణను వేగవంతం చేయా లన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. అప్పుడు వైసీపీని బీజేపీలో విలీనం చేయాలని జగన్పై ఒత్తిడి తేవాలన్నది కమలదళం వ్యూహంగా చెబుతున్నారు’ అనిన ఈ వాక్యాలు చాలు ఆర్కే చెబుతున్నవన్నీ అబద్ధాలని చెప్పడానికని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
ఇదే ఆర్కే గత కొత్త పలుకు వ్యాసంలో వైసీపీ ఓటు బ్యాంకు ఎప్పటికీ బీజేపీ వైపు రాదని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.నిజానికి క్షేత్రస్థాయిలో రాజకీయం గా బీజేపీ బలపడాలని గట్టిగా నిర్ణయించుకుందని, అందుకే చంద్రబాబు, లోకేశ్ను అవినీతి కేసులో జైల్లో వేసేందుకు మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని టీడీపీ అభిప్రాయపడుతో౦ది.అందుకు భిన్నంగా బిజెపి జగన్ వెనుకబడిందని,ఆయనను కేసుల్లో ఇరికించబోతోందని ఆర్కే రాయడం అందరూ గమనించాలని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.అయితే అసలు వాస్తవాలు ఇలా ఉంటే…వీటి నుంచి రాజకీయాలను దారి మళ్లించేందుకు వారం వారం ఆర్కే పొంతన లేని రాతలు రాస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు .ఒక్క చంద్రబాబు లోకేష్లకు తప్ప ఆంధ్రజ్యోతి రాతలు టిడిపి నేతలకే నచ్చడం లేదని స్పష్టమైపోతుంది! టిడిపి కూడా దూరంగా పెడితే ఆంధ్రజ్యోతి అవుట్ !ఇదే ఆర్కే పతనానికి దారి తీసేదిగా ఉంది!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?