(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. గడచిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలం వరకూ టీడీపీలో ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే అపవాదు ఉండేది. పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి పట్టుగొమ్మలుగా ఉన్న కొన్ని వర్గాల వారు గడచిన ఎన్నికల్లో టీడీపీకి దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న తపనతో చంద్రబాబు దూరమైన వర్గాలను దగ్గరకు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఈ క్రమంలోనే బీసీ మంత్రాన్ని జపిస్తున్నారుట. ఈ కారణంగానే గత నెలలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా, సీనియర్ నేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన కింజరపు అచ్చెన్నాయుడును నియమించారు. అదే విధంగా గత నెలలో సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో పదవులను ప్రకటించారు. అంతకు ముందు పార్లమెంటరీ ఇన్చార్జీలు, అధ్యక్షులను నియమించారు. ఈ పదవుల పంపిణీలోనూ బీసీలకు అదిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర కమిటీలో బీసీలకు 41శాతం, ఎస్సీలకు 11శాతం, ఎస్టీలకు మూడు శాతం, మైనార్టీలకు ఆరు శాతం మందికి కొత్త కమిటీలో చోటు కల్పించారు.
219 మందితో ప్రకటించిన నూతన రాష్ట్ర కమిటీలో 18 మంది ఉపాధ్యక్షులు. 16మంది ప్రధాన కార్యదర్శులు, 18మంది అదికార ప్రతినిధులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉన్నారు. ఈ కొత్త కమిటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 61శాతం మందికి చోటు కల్పించారు. అదే విధంగా మహిళా నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక పోతే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ రెడ్డికి కీలక పదవి ఇచ్చారు. ఆయనను సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించారు.
టీడీపీ రాష్ట్ర కమిటీ పూర్తి వివరాల కొరకు కింద లింక్ క్లిక్ చేయండి