అమరావతి: హింస ద్వారా రాజకీయం చేద్ధాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్లా మోది, షాలను నమ్మి మోయడానికి సిద్ధంగా లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. నిన్న పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనపై బుధవారం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మమతా బెనర్జీకి సంఘీభావం తెలియజేస్తూ అమిత్షా చర్యలను చంద్రబాబు ఖండించారు.
పశ్చిమ బెంగాల్లో అమిత్ షా నిన్న కావాలనే తన ర్యాలీలో గుండాలతో అల్లర్లు సృష్టించడం చూశామని చంద్రబాబు అన్నారు. గతంలో గుజరాత్లో కూడ అమిత్షాను అడ్డుపెట్టుకొని మోది ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం భారతదేశంలో ప్రజలందరకీ తెలిసిందేనని చంద్రబాబు అన్నారు.
‘పశ్చిమ బెంగాల్లో అసలు బలం లేని బిజెపి సీనియర్ మహిళా నేతలాంటి మమతా బెనర్జీపై రాక్షసుల్లా విధ్వంసం సృష్టించి, అక్కడ ప్రభుత్వానికి చెడ్డపేరు కల్పించి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనే వికృత మోది, షాల పాచిక పారదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ధర్మోరక్షిత రక్షితః అనే సక్తికి విరుద్దంగా, హింస ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే వారి ఆటలు సాగవని చంద్రబాబు అన్నారు.
‘సిబిఐ, ఈడి, ఐటిలకు బయటపడలేదనీ, ఎన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించే ప్రయత్నంలో భాగంగా బిజెపి వారి బి టీంలు గుండాలను నేరుగా రంగంలోక తెచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు ఇటువంటి చర్యలకు పాల్పడతారు’ అని చంద్రబాబు విమర్శించారు.