అమరావతి: ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు గేటు వద్ద సోమవారం టిడిపి ఆందోళనకు దిగింది. ప్లకార్డులతో లోపలకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ చంద్రబాబుతో సహా టిడిపి నేతలను గేటు వద్దే పోలీసులు ఆపివేశారు.ఈ సందర్భంలో తెలుగు తమ్ముళ్లు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుుకంది. ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని అన్నారు. టిడిపి హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని బాబు వివరించారు. సబ్సిడీపై తక్కువ ధరలతో ఉల్లి అందించామని చెప్పారు.ధరలు తగ్గేవరకూ టిడిపి పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయనీ, పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ చంద్రబాబు అన్నారు. మరో పక్క రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లభించడం లేదని చంద్రబాబు విమర్శించారు.
previous post
next post