టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పోలీసులపైనా కేసులు పెట్టాలంటూ పార్టీ శ్రేణులకు వివాదాస్పద సూచనలు జారీ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చంద్రబాబు పార్టీ శ్రేణులతో ఎమన్నారంటే..
“నాయకులకు లీడర్ షిప్ ఇవ్వాలి, నియోజకవర్గంలో వర్క్ అవుట్ చేయాలి, తప్పుడు కేసులు పెట్టే రోజులు అయిపోయాయి. మీరు కూడా అయిదారుగురు పోలీసుల మీద నాలుగు కేసులు పెట్టండి. వాళ్లే దారికి వస్తారు. తప్పుడు కేసులు పెట్టడం మానేసీ మీ కాళ్ల బేరానికి వస్తారు, ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను, ఉంకో విషయం కూడా చెబుతున్నా, మన మీద కేసులు పెడుతున్నారని మీరు సైలెంట్గా ఉండటం కంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కేసులు పెట్టండి, వాళ్ళు ఒకటి పెడితే కావాలంటే మీరు రెండు పెట్టండి, ఒక వేళ వాళ్లు తీసుకోలేదనుకోండి ఆన్ లైన్ పంపండి, రిజిస్టర్ చేయండి, ప్రతి రోజు డీజీపీ ఊదరగొడుతున్నాడు, మేము టెక్నాలజీలో నెంబర్ అని. ఆ టెక్నాలజీ మీరు ఉపయోగించండి. రిజిస్టర్ చేయండి, అకనాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఎవడైనా తప్పు చేస్తే వాడు గానీ ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మరో రెండేళ్లలో మనం వస్తాం, ఇవన్నీ ఓపెన్ చేస్తాం, వీళ్లందరినీ పనిష్ చేస్తాం. ఆ మెసేజ్ కూడా వాళ్ల ఇవ్వండి. మీ మీద కేసు పెడుతున్నాం, కోర్టుకు వెళుతున్నాం అని, కొన్ని రిజిస్టర్ చేద్దాం, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేద్దాం, అందుకనే అధైర్యపడకుండా ముందుకు పోవాలని మరోక సారి కోరుకుంటూ ఎక్కడికక్కడ యాక్టివ్ కావాలి పార్టీ” అంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచనలు జారీ చేశారు.