గుంటూరు: వైసిపి బెదిరింపులతో పల్నాడు ప్రాంతం నుండి వలసలు వెళ్లిన బాధితుల కోసం గుంటూరులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పల్నాడు ప్రాంత టిడిపి నాయకులతో మంగళవారం నిర్వహించిన టెలీకాన్షరెన్స్లో ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పారు. గత మూడున్నర నెలల్లో వైసిపి అరాచకాలకు అంతే లేకుండా పోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు, ఆస్తుల విధ్వంసం, కబ్జాలు, వేధింపులు, అక్రమ కేసులకు అంతే లేకుండా పోయిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే నిస్సహాయత వ్యక్తం చేసే పరిస్థితులు కనబడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వైసిపి బాధితులకు టిడిపి అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లిన బాధిత టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు గుంటూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే తానే స్వయంగా వారిని గ్రామాలకు తీసుకువెళతానని చంద్రబాబు చెప్పారు.
previous post
next post