(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: చైనాలోని వుహాన్లో చిక్కుకున్న 58మంది భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్లు లేఖ రాశారు.
చైనాలో కరోనా వ్యాధి వ్యాప్తితో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఏపిలోని శ్రీసిటి సెజ్, టిసిఎల్కి చెందిన 58మంది ట్రైనీ ఉద్యోగులు ఉన్నారనీ వారిని వెంటనే భారత్కు రప్పించి కుటుంబ సభ్యులకు ఊటర కల్పించాలనీ చంద్రబాబు లేఖలో కోరారు.