కరోనా విషయంలో బాబు ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారు.. ఒక్కోసారి ఒక్కో అభిప్రాయాన్ని వెళ్లుబుచ్చుతున్నారు.. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. కరోనా చాలా ప్రమాదం… వైకాపా నాయకులు సహాయ కార్యక్రమాల సంగతులు ఎలా ఉన్నా… కరోనా అక్కడ బాగా వ్యాప్తి చెందుకుతుంది అన్నారు. తీరా హైదరబాద్ టు అమరవాతి వచ్చినప్పుడు రోడ్డంతా అదేపనిచేసుకుంటూ వచ్చారు.
మొన్నటికి మొన్న కరోన్నాతో చాలా జాగ్రత్తగా ఉండాలని అమరవాతిలో మహానాడు కార్యక్రమం అవ్వడం ఆలస్యం… హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయిన బాబు… అచ్చెన్నాయిడికి అరెస్టు చేసిన తర్వాత మాత్రం… ధర్నాలూ దీక్షలు చేయాలన్నట్లుగా టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. కరోనా వ్యాప్తిని లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలో మరోసారి అసెంబ్లీ సమావేశాల విషయంలోనూ టీడీపీ తన ఆలోచనను అలానే అమలు చేసింది.
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా తప్పనిపరిస్థితుల్లో శాసనసభను రెండు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. దానికి స్పందించిన టీడీపీ బడ్జెట్ సమావేశాలు కనీసం 15 – 20 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేసింది. నిన్న మొన్నటివరకూ అసలు బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా అని టీడీఎల్పీ సమావేశాలు నిర్వహించుకుని, భారీ డిస్కషన్స్ చేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరైన టీడీపీ నేతలు… ఎలాగూ పెంచరని తెలిసినా… కరోనా అని వారిలోనూ భయమున్నా… తాము అసలు బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు హాజరవుదామా, ప్రజాసమస్యలపై ప్రశ్నిద్దామా అని ఎదురుచూస్తున్నట్లున్న రేంజ్ లో 15-20 రోజులు కావాలని అడుగుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ మాటలు విన్న టీడీపీ కార్యకర్తలు… చంద్రబాబు అభిమానులు మాత్రం… ఈ వయసులో, కరోనాతో రిస్క్క్ అవసరమా బాబు… అసలు మీ ఆరోగ్యం గురించి, మిమ్మల్నే నమ్ముకున్న నాయకుల గురించి మీరేమనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారంట… అభిమానంతో!
ఈ టీడీపీ డిమాండ్ పై సున్నితంగా స్పందించిన సీఎం… సమావేశాలు 30రోజులు నిర్వహించడానికైనా తాను సిద్ధమే… తాము చేసిన సంక్షేమం గురించి, చేయబోతున్న అభివృద్ధి గురించి, మీరు చేసిన అవినీతి గురించి ప్రజలకు చెప్పుకోవాల్సింది చాలా ఉంది కానీ… ప్రజల ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ప్రజా ప్రతినిధుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అలా నిర్ణయించాము… ఈ సమావేశాల సమయంలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే… మళ్లీ మీరే ప్రభుత్వంపై బురద జల్లుతారు అని క్లారిటీ ఇచ్చారు! దీంతో… సైలంట్ అయిపోయారు టీడీపీ నేతలు!!
ఆ సంగతులు అలా ఉంటే… 20రోజుల పాటు సమావేశాలు కావాలని అడిగిన టీడీపీ ఎమ్మెల్యేలు నల్లచొక్కాలు ధరించి శాసనసభకు హాజరై.. ఉదయం 10 నుంచి 10:35 గంటల వరకూ నిల్చుని, అనంతరం వాకౌంట్ చేసి వెళ్లిపోవడం గమనార్హం!