ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన జరిగిన తరువాత మిగిలిన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు లేక ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ప్రతిపక్ష పార్టీ పోషించే రీతిలో..టిడిపి నిరూపణ పెడుతూ వ్యవహరించటం మరోపక్క జగన్ టిడిపి పునాదులు కంచుకోటలు కదిలి పోయేలా సరికొత్త రాజకీయ ఎత్తుగడలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ముందు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ విభజన జరిగిన తర్వాత గానీ టిడిపి కి కంచుకోటగా ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర.
ఇక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగిన తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో గెలిచేది. చాలా సందర్భాలలో చంద్రబాబు ఉత్తరాంధ్ర టిడిపి పార్టీ పరువు కాపాడటమే కాక గౌరవప్రదమైన సీట్లు కట్టబెట్టేది అంటూ చెబుతూ ఉండేవారు. అటువంటి ఈ ప్రాంతంలో 2019 ఎన్నికలలో జగన్ పాదయాత్ర దెబ్బకి.. ఉత్తరాంధ్రలో చాలా వరకూ తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది. ఇంత మాత్రమే గాక ఉత్తరాంధ్ర వాసులకు దగ్గరగా ఉండే విశాఖ పట్టణాన్ని జగన్ రాజధానిగా గుర్తించటంతో.. ఉత్తరాంధ్ర వాసులు వైసీపీ పార్టీకి గట్టిగా మద్దతు ఇస్తున్నారు. అంతమాత్రమే కాకుండా మరోపక్క టీడీపీకి అండగా ఉండే కీలక నాయకుల పై జగన్ సర్కార్ టార్గెట్ చేస్తూ చేస్తున్న ఆపరేషన్ అక్రమాల పేరిట బయటపడుతున్న అవినీతి ఇప్పుడు ఉత్తరాంధ్ర లో ఉన్న టిడిపి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. దీంతో చాలా వరకు ఉత్తరాంధ్ర లో ఉండే టిడిపి నేతలు వైసీపీ పార్టీ వైపు చూస్తున్నట్లు .. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న పరిణామాలను బట్టి చూస్తే త్వరలో టిడిపి దుకాణం సర్దడం గ్యారెంటీ అనే టాక్ వినబడుతుంది.