హైకోర్టు పేరు చెబితేనే వైకాపా నేతలు తలలుపట్టుకుంటున్న పరిస్థితి అని కామెంట్లు వస్తున్న సమయమిది! ఏ విషయాలపై ఎవరు కోర్టుకు వెళ్లినా.. ఉన్నత న్యాయస్థానం నుంచి జగన్ సర్కార్ కు మెజారిటీ కేసుల్లో మొట్టికాయలు పడిపోతున్నాయి! నిజం చెప్పాలంటే… గత ఏడాదిలో ప్రతిపక్షాలు చేసిందేమీ లేదు కానీ, హైకోర్టే ఆ పాత్ర పోషించిందని కూడా కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి జగన్ సర్కార్ పై హైకోర్టును ఆశ్రయించింది టీడీపీ. ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ హైకోర్టులో రెండు పిటిషన్లు ధాఖలు చేశారు.
మండలి రద్దు కోసం శాసనసభ చేసిన తీర్మానం ఎమ్మెల్సీల హక్కుల్ని కాలరాసేలా ఉందని.. సీఆర్డీఏ రద్దు బిల్లు విషయంలో ఏపీ సర్కార్ చేస్తున్న పని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో… పాలన వికేంద్రీకరణ బిల్లు (మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లు, శాసనసమండలి రద్దు వ్యవహారం మరో మలుపు తిరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీంతో… బంతి హైకోర్టు చేతిల్లోకి వెళ్లిన తర్వాత వైకాపా నేతలకు కాస్త టెన్షన్ అనే చెప్పాలి!
ఈ క్రమంలో… శాసనసభ ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపించిన అనంతరం… కేవలం రాజకీయ ప్రయోజనలాకోసం శాసన మండలిని రద్దు చేయాలని తీర్మానం చేశారని దీపక్ రెడ్డి ఆ పిటిషన్ లో ప్రస్తావించారు. పార్లమెంటులో దీనిపై ఎలాంటి బిల్లు, చట్టం చేయకుండా లోక్ సభ సెక్రటరీ జనరల్ ను ఆదేశించాలని కోరారు. గతంలో శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లుల్ని మళ్లీ శాసనసభలో ప్రవేశపెట్టారని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ బిల్లుల్ని మరోసారి మండలికి పంపించారని గుర్తు చేశారు. ఆ బిల్లుల్ని మండలి చైర్మన్ తన అధికారాల మేరకు సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశారని గుర్తు చేశారు. కానీ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు చైర్మన్ ఆదేశాలను పాటించలేదని పిటిషన్లో వివరించారు.