వైసిపి మంత్రి మరియు భీమిలి ఎమ్మెల్యే ముత్తంసెట్టి శ్రీనివాస్ రావు అలియాస్ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు మరియు అతని అనుచరులు అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
గంటా శ్రీనివాసరావు టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు చేసిన మంచి ఏమీ లేకపోయినా విశాఖ పరిధిలోని ప్రతి ఊరిలో ప్రతి వార్డులో చాలా గజాల భూమిని ఆక్రమించారని.. ఇదంతా వీరికి వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఇద్దరు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజాగా గంటా శ్రీనివాసరావుని కూడా రేపోమాపో అరెస్టు చేసే సూచనలు ఉన్నాయని అవంతి శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కాలేదని.. ఇంకా తామే 400 ఎకరాల భూమిని కాపాడమని అవంతి శ్రీనివాస్ అన్నారు.