త్వరలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండటంతో గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ వరకు వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీల నాయకులు హైకమాండ్ ఇచ్చే ఆదేశాలు అనుసరించేలా తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని ఈనెల 17వ తారీఖున ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ క్రమంలో తిరుపతి లోక్సభ పరిధిలో నేతలకు చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడుతూ 70 క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా 9, 10, 11 తారీకులలో పార్టీ నేతలతో సమావేశమై నియోజకరవ్గాల స్ధాయి కమిటీలను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలో సభ నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాటైన కమిటీ సభ్యులు నడుచుకోవాలని చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉండగా తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోన రావటం తో 17 వ తారీకు తిరుపతి లో ప్రారంభించే పార్టీ కార్యాలయానికి ఆయన రాకపోవచ్చు అనే టాక్ వినపడుతోంది. మరోపక్క తిరుపతి ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు విగ్రహాలు ధ్వంసం వంటి విషయాలను లేవనెత్తి మతపరంగా అధికార పార్టీని ఇరుకున పెట్టే రీతిలో ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు అండ్ కో రెడీ అవుతున్నట్లు ఏపీ రాజకీయవర్గాలలో టాక్ వినబడుతోంది. ఈ విధంగా వ్యవహరిస్తే ఒకపక్క జగన్ ని ఇరుకున పెట్టినట్లు అవుతుంది అని మరోపక్క బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ స్ట్రాటజీ ఇదే అన్న టాక్ గట్టిగా వినబడుతోంది.