ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇంచార్జి పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి బాబు ప్రకటించిన వారిలో ఎక్కువగా బీసీలకు పెద్దపీట వేయడంతో పాటు యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వటంతో పార్టీని నమ్ముకుని చాలామంది కీలక నాయకులు మరియు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు పార్టీ మారి పోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
దాదాపు బీసీ మరియు ఎస్సీ ఓటు బ్యాంకు వైసీపీ వైపు ఉన్న నేపథ్యంలో వాళ్లను ఆకర్షించడానికి బాబు వేసిన ఫార్ములా ఇప్పుడు టిడిపి పార్టీనే కొంప ముంచుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఎప్పటి నుండో పార్టీకి వీర విధేయులుగా ఉన్న చాలామంది టిడిపిని వీడాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో మాగంటి రాంజీ పార్టీ మారాలని ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడు ఇదే మాదిరిగా తాళ్లపాక రమేష్ రెడ్డి కుటుంబం కూడా టిడిపిని వీడాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ వీరాభిమాని గా పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా నే ఉంటుంది తాళ్లపాక రమేష్ రెడ్డి కుటుంబానికి ఇటీవల ప్రకటించిన కొత్త కమిటీలలో చోటు కల్పించకుండా చంద్రబాబు నిర్ణయాలు ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రమేష్ రెడ్డి భార్య కొన్నేళ్ల నుంచి ఊపాధ్యక్షురాలిగా పార్టీలో ఉన్నారు. ఈసారి ఆమెకు ఏపదవి ఇవ్వకపోవడం తమను పక్కన పెట్టడమేనని భావించిన రమేష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోంబాబు కూడా రాజీనామా చేయటం తో టిడిపి పార్టీ కొత్త ఇంచార్జి పదవులు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.