విశాఖపట్నం: టిడిపి నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడుకి స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలోని ఆసుపత్రిలో అయనకు ప్రధమ చికిత్స చేశారు.