గుంటూరు: రాజధాని అమరావతికి మద్దతుగా టిడిపి నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మహా పాదయాత్ర ప్రారంభించారు. తెనాలి నుంచి వెలగపూడి వరకు జెఏసి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు – అమరావతే ముద్దు, అమరావతినే రాజధానిగా కొనసాగించాలి అంటూ నినాదాలు చేశారు.
నేతల పాదయాత్ర నేపథ్యంలో తెనాలిలో భారీగా పోలీసులను మొహరించారు. పలువురు జెఏసి, టిడిపి ముఖ్య నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. తెనాలిలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.