అమరావతి: అన్న క్యాంటిన్లను నిర్వహించడం ఇష్టం లేనప్పుడు ఆ క్యాంటిన్ల రంగు మార్చడానికి 11కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు పెట్టారో సిఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా అని టిడిపి నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటిన్లపై ఉన్న పసుపు రంగు తొలగించి తెలుపు రంగు వేస్తున్నారు. దీనిపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిఎం జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి వర్ల ట్వీట్ చేస్తూ ‘అన్న క్యాంటిన్లంటే మీకు అయిష్టం గదా? వాటిని కొనసాగించే ఉద్దేశ్యం మీకు లేదు కదా? మరి, అన్న క్యాంటిన్ల రంగు మార్చడానికి 11 కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు పెట్టారో రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? ఇది వృధా ఖర్చు కాదా? చంద్రబాబు మీదే కాదు, ఆయన వేసిన రంగుల మీద కూడా కోపమేనా? ఇదేనా రాజన్న రాజ్యం.’ అంటూ విమర్శించారు.
To AP CM. ఆర్యా! అన్న కాంటీన్ లంటే మీకయిష్టం గదా? వాటిని కొనసాగించే ఉద్దేశ్యం మీకు లేదు కదా? మరి, అన్న కాంటీన్ల రంగు మార్చడానికి 11 కోట్ల₹ ఖర్చు ఎందుకు పెట్టారో రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? ఇది వృధా ఖర్చు కాదా? చంద్రబాబు మీదే కాదు, ఆయన వేసిన రంగుల మీద కూడా కోపమేనా? రాజన్న రాజ్యం.
— Varla Ramaiah (@VarlaRamaiah) August 5, 2019