అమరావతి: ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఆ పని చేయకపోతే భవిష్యత్ లో యువత నష్టపోతుందన్నారు. టీడీపీ హయాంలో దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఏపీ ఉండేదని, ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రేటింగ్ పడిపోతే పెట్టబడుదారులు ఎవరూ తమ పెట్టుబడులు ఇక్కడ పెట్టేందుకు రారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ మూర్ఖత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని యనమల విమర్శించారు.
previous post
next post