TDP: తెలుగుదేశం పార్టీ(TDP) అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్(Jagan) పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పరుష పదజాలంతో ఏకవచనంతో బోసి డికే… అంటూ దారుణమైన బూతులు మాట్లాడటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్న వైసిపి(ycp) పార్టీ శ్రేణులు.. టిడిపి(tdp) ప్రధాన కార్యాలయంపై వివిధ నగరాలలో ఉండే పార్టీ ఆఫీసులో పై దాడులు చేయడం తెలిసిందే. దీంతో దాదాపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి ఇలా ఉంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటూ.. తాజా ఘటనలపై కార్యాలయాలపై అదేరీతిలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల పై జరిగిన దాడిని ఖండిస్తూ చంద్రబాబునాయుడు 36 గంటల పాటు నిరసన దీక్షకు కూర్చోవటం జరిగింది. అంతకుముందే రాష్ట్రంలో చంద్రబాబు(Chandrababu) బంద్ కి పిలుపునివ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా పార్టీ కార్యాలయాలపై దాడి అదేరీతిలో పట్టాభి ఇంటి.. వద్ద కూడా విధ్వంసకర వాతావరణం సృష్టించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నీ.. కలవడం జరిగింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రామానాయుడు.. కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై అదే రీతిలో మిగతా నాయకుల పై జరుగుతున్న దాడిని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. అంత మాత్రమే కాక దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజీలను కూడా గవర్నర్కి అందజేయడం జరిగింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత
రాష్ట్రంలో శాంతిభద్రతలు సమస్య తలెత్తకుండా 356 ఆర్టికల్.. అమలు చేయాలని దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత.. విచారణ చేయించాలని కోరారు. ఈ క్రమంలో గవర్నర్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో.. అచ్చం నాయుడు మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడి విషయంలో.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని.. పేర్కొన్నారు. అంత మాత్రమే కాక దాడుల అంశాన్ని రాష్ట్రపతి అదేవిధంగా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని తమ పైన దాడి చేసి మరీ కేసులు పెట్టారని పేర్కొన్నారు. లోకేష్ మరికొంతమంది కీలక నాయకుల పై తప్పుడు కేసులు పెట్టినట్లు రాష్ట్రంలో డీజీపీ అసమర్ధుడు అంటూ.. అచ్చం నాయుడు వైరల్ కామెంట్ చేశారు.