టిడిపి ధర్మ పరిరక్షణ పేరుతో గురువారం అలిపిరి రోడ్డు వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు బైఠాయించి రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు, మరొక సీనియర్ నేత నిమ్మల రామానాయుడు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో టీడీపీ నేతలు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు అని పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని స్టేషన్ల కు తరలించారు. అయితే వీరు మాత్రం తమ పోరాటానికి భంగం కలిగిస్తున్నారు అని పోలీసులపై విపరీతంగా ఫైర్ అయినట్లు సమాచారం. ఇక వీరిరువురి ని అదుపులోకి తీసుకున్న తర్వాత అచ్చెన్నాయుడు పోలీసులపై విపరీతంగా విరుచుకుపడినట్లు చెబుతున్నారు. పోలీసుల ఉద్యోగ సంఘాల నేతలను నోట్ చేసుకుంటామని… రిటైర్ అయిపోయిన కూడా ఎవరిని వదలని అచ్చెన్నాయుడు హెచ్చరించారట.
అలాగే ఇంటింటికి వెళ్లి మరీ ధర్మ పరిరక్షణ యాత్ర ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని…. అంతేకాకుండా సంతబొమ్మాలి లో టిడిపి నేతలు అన్యాయంగా ఇరికించారని… బిజెపి వారి కంటే మాది స్వచ్ఛమైన యాత్ర కానీ ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగోలేదని అచ్చెన్నాయుడు చెప్పినట్లు పోలీసులు వివరించారు.
ఇక నిమ్మల రామానాయుడు అయితే తిరుచానూరు సమీపంలో ఉన్న హోటల్ వద్ద విధినిర్వహణలో ఉన్న మహిళ ఎస్ ఐ దీపిక పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. “ఇక్కడ నీకేం పని?” అని ఆ మహిళ ఎస్ ఐ ను అడిగిన రామానాయుడు “నీ అంతు చూస్తా…” అని బెదిరించినట్లు కూడా ఆమె వాపోయింది.
అంతేకాకుండా టిడిపి నేతలు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని పోలీసు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ కులమత రాజకీయాలు తమకు తెలియదని…తమకు కులమతాలు ఉండవని.. తమదంతా ఖాకీ కులమని చెప్పుకొచ్చారు.