ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న… అవినీతిపై ఉక్కుపాదం విషయంలో టీడీపీ నెతలు బెంగపట్టుకున్నారని తెలుస్తోంది! అది ఎంతలా అంటే… రాష్ట్రంలో ఉండటం కంటే… బాబుగారున్న హైదరబాద్ కి వచ్చేసి, ఆయన ఆధ్వర్యంలో, ఆయన సమక్షంలో తలదాచుకుంటే బెటరనే పరిస్థితి దాపురించిందంట. ప్రస్తుత పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి. ఎప్పుడు ఏ నాయకుడిని, ఎప్పుడు ఏ మంత్రిని, ఏ క్షణం ఏ అధికారిని ఏసీబీవాళ్లు పట్టుకుపోతారో తెలియని పరిస్థితి! ఈ పరిస్థితుల్లో గతంలో అవినీతిలో హస్తం ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు రాష్ట్రం వీడుతున్నారని.. హైదరాబాద్ కి వలసవచ్చేస్తున్నారని తెలుస్తోంది!
ఇక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టు కావడంతో టీడీపీ నేతల్లో ఒక్కసారిగా అలజడి రేగిందట. ఈ అలజడిలో భాగంగా ఇద్దరు మాజీ మంత్రులు ఒక మాజీ ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్ళారు అని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న కీలక అధికారులు కూడా భయపడుతున్నారని తెలుస్తుంది. వారు కూడా బెంగళూరు కు వెళ్లిపోయారని, వారి ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయని అంటున్నారు!
ఈ విషయంలో ఏసీబీ ఏమాత్రం తగ్గడం లేదు.. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహమో… చాలా కాలంగా సరైన పనిలేదనే ప్రస్ట్రేషనో తెలియదు కానీ… ఏసీబీ చాలా వరకు దూకుడుగా ఉంది. ఈ క్రమంలో అజ్ఞాతంలో ఉన్న ఆ ఇద్దరు మాజీ మంత్రులు, వారి పుత్రరత్నాలు, మాజీ ఎమ్మెల్యేల విషయంలో ఏ క్షణం పంజా విసురాతో అన్నది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. ఏది ఏమైనా… ఏసీబీ మాత్రం టీడీపీ నేతలకు నిద్రపట్టకుండా చేస్తుందనే అనుకుంటున్నారు తమ్ముళ్లు!