NewsOrbit
న్యూస్

TDP MLC: డిక్లరేషన్ జారీలో జాప్యం .. విజేత సహా టీడీపీ నేతల అరెస్టు..కౌంటింగ్ కేంద్రం వద్ద రాత్రంతా ఉద్రిక్తత

TDP MLC: మూడు రోజుల పాటు తీవ్ర ఉత్కంఠగా సాగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో చివరకు విజయం టీడీపీని వరించింది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అధికార వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి పై టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,543 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సహా పలువురు వైసీపీ శ్రేణులు రీకౌంటింగ్ జరపాలంటూ ఆందోళన నిర్వహించారు. కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా అధికారికంగా అధికారులు ప్రకటించినా ఆయనకు డిక్లరేషన్ మాత్రం ఇవ్వలేదు. గంటలు గడుస్తున్నా భూమిరెడ్డికి డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

TDP Leaders Protest

 

ఇదే సమయంలో భారీ మెజార్టీతో గెలిచిన తమ పార్టీ అభ్యర్ధిని అభినందించేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరాం తదితరులు జేఎన్ టీయూ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఎంతకూ డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో రాత్రి 11.20 గంటల సమయంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తో కలిసి పార్టీ నేతలు జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం వద్ద భైటాయించారు. గెలుపొందిన టీడీపీ అభ్యర్ధికి వెంటనే డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని కాలవ, పరిటాల సునీత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోతుండటంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో రిటర్నింగ్ అధికారి తిరిగి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి వేరే మార్గం నుండి వెళ్లిపోయారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాత డిక్లరేషన్ ఫారం అందజేస్తామని అధికారులు టీడీపీ నేతలకు చెప్పినా వారు ఆందోళన కొనసాగించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

TDP MLC Winner Ramgopal Reddy Arrest

 

అర్ధరాత్రి సమయంలో అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సహా కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ వద్ద కూడా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 వరకూ నేతలను పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఆ తర్వాత నేతలను ఇళ్లకు పంపించివేశారు. కాగా అధికారులు డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్, ఆయన కార్యాలయం ఒత్తిడితో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత, టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. టీడీపీ అభ్యర్ధి గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించినా డిక్లరేషన్ ఇవ్వలేదని లేఖలో వివరించారు.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న టీడీపీ .. కౌంటింగ్ లో అక్రమాలు అంటూ వైసీపీ ఆరోపణ

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju