గుంటూరు, మార్చి 5: టిడిపి సీనియర్ నాయకుడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మంగళవారం వంపారు.
మోదుగుల ప్రస్తుతం ఎథిక్స్ కమిటి చైర్మన్ గా కూడా ఉన్నారు.
గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఆయన నిన్న గుంటూరు జిల్లా నేతల సమావేశానికి గైర్హాజరయ్యారు.
బుధవారం సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో భేటీ అయి పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
మోదుగుల రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.పార్లమెంట్ అవకాశం లేకపోతే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వలేదు. అభ్యర్థుల పేర్ల పరిశీలనలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరును కూడా తీసుకోలేదు.