(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. టిడిపి ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి పాదయాత్రగా వస్తుండగా ఆయన సమీపంలో ఓ డ్రోన్ కెమెరా అకస్మాత్తుగా కింద పడింది. ఆపరేటింగ్ లోపంతో విద్యుత్ తీగలకు తగిలి డ్రోన్ కెమెరా ఒక్క సారిగా కింద పడింది.
ఈ ఘటనతో నారా లోకేష్తో పాటు ఇతర ఎమ్మెల్సీలు ఉలిక్కిపడ్డారు. మంగళగిరి నుంచి అసెంబ్లీ వరకు నారా లోకేష్ సిటీ బస్సులో వచ్చారు. ఆర్టిసి ఛార్జీలు పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.