అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ఈ నెల 10వ తేదీ తర్వాత రాజధాని రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనీ టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇంత వరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని లోకేష్ విమర్శించారు. టిడిపి ప్రభుత్వం చేపట్టిన పనులపై మంత్రివర్గ ఉప సంఘాన్ని వేశారని లోకేష్ అన్నారు. కమీషన్లు తీసుకునే కొందరు నాయకులు ఏసీ రూముల్లో ఉండి తమపై ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ అన్నారు.
మరో పక్క ట్విట్టర్ వేదికగా కూడా ప్రభుత్వ చర్యలను విమర్శించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై అబద్దాలకు కూడా ఇంత డబ్బు తగలెయ్యాలా అంటూ లోకేష్ విమర్శించారు.
‘జనవరి 2019నుండి జూన్ 2019 వరకు అంటే ఆరు నెలల పాటు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? అందులో ఐదు నెలల పాటు చంద్రబాబు సిఎంగా ఉండగా ఇచ్చారన్న సంగతి మర్చిపోయారా ? ఒక ప్రభుత్వ ప్రకటనలో ఇన్ని అబద్దాలా?’ అని లోకేష్ ప్రశ్నించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?