(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్లో గట్టిగా పోరాడతామని టిడిపి పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అమరావతి ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఏపీ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు జయదేవ్ మద్దతు తెలిపారు. మందడంలో సోమవారం రైతులను కలిసి వారికి తన సంఘీభావాన్ని ప్రకటించారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులు, మహిళలను కించపరిచే వారు సిగ్గుపడాలన్నారు. అభివృద్ధి అంటే రాజధానిని విభజించడం కాదని గల్లా అన్నారు. అలా విభజించుకుంటూ పోతే ఖర్చు పెరుగుతుంది తప్ప ఆదాయం రాదని పేర్కొన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని మహిళలు ఆయనకు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా బనాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?