బీజేపీ నేతలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ లను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదో పెద్ద వివాదంగా కూడా మారిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంపై తాజాగా విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆ వివాదం మరింత ముదిరేలా చేశాయి .బీజేపీ నేతలతో నిమ్మగడ్డ కలవడంలో తప్పేంటి అని అని ఎంపీ ప్రశ్నించారు.
నిమ్మగడ్డ స్థానంలో ఎన్నికల కమిషనర్ గా నియమించిన రిటైర్డ్ జడ్జ్ కనగరాజ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిస్తే తప్పు లేదు కానీ.. నిమ్మగడ్డ సుజనాను కలిస్తే తప్పా అని కేశినేని నాని నిలదీశారు . వైసీపీ నాయకులకు ఒక నీతి.. మిగతా వారికి ఇంకొక నీతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రహస్య భేటి ఎలా అవుతుందని విమర్శించారు.
రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డ ఇలా చేశాడని విమర్శిస్తున్న వైసీపీ నేతలు.. అసలు నిమ్మగడ్డను వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా గుర్తించిందా.? ఆ పదవిలో ఉన్నాడో లేదో చెప్పాలని వైసీపీ నేతలను కేశినేని ప్రశ్నించారు.
అయితే బీజేపీ నేతలతో భేటి అయిన నిమ్మగడ్డకు సపోర్టుగా టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ బీజేపీ ఒకటేనా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.అంతేగాక కేశినేని నాని కూడా ఆ ముగ్గురి సామాజిక వర్గీయుడు కావటం కొస మెరుపు.ఈ వివాదంలో కేసినేని నాని వేలు పెట్టడాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాలి.