విజయవాడ: అమరావతి పరిరక్షణ కోసం పోరాడుతున్న ముగ్గురు ఎంపీలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత సీఎం జగన్దేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జగన్ ఎన్ని కేసులు పెడితే తమకు అన్ని సన్మానాలు చేసినట్లేనని కేశినేని నాని పేర్కొన్నారు. తనపై, తమ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనమేడల రవీంద్రపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని కేశినేని నాని స్పష్టం చేశారు.
అమరావతి పరిరక్షణ కోసం రాష్ట్రం కోసం రైతులు కోసం పోరాడుతున్న ముగ్గురు పార్లమెంటు సభ్యుల మీద@JayGalla @kesineni_nani @kanakamedalaravindra మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత నీదే జగన్ రెడ్డి @ysjagan నువ్వు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్లే అవుతుంది గుర్తుంచుకో
— Kesineni Nani (@kesineni_nani) January 23, 2020