విజయవాడ: టిడిపి ఎంపి కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో ఆయన నివాసంలో నిర్బందించారు. అదే విధంగా విజయవాడలోనే టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్ననూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి ప్రాంత రైతులు కొనసాగిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో వీరు పాల్గొనకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
మరో వైపు రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు తన ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలనీ,అభివృద్ధి వికేంద్రీకరణకే చర్యలు తీసుకోవాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు.రైతుల ఆందోళనకు ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి.