2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి తెలుగుదేశం పార్టీ పరిస్థితి దాదాపు దుకాణం సర్దేస్తున్న రీతిలో పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చిన ఫలితాలు చూసి చాలామంది చంద్రబాబుకి నమ్మకంగా ఉన్న నాయకులే అతి తక్కువ టైమ్ లోనే పార్టీ జంప్ అయిన పరిస్థితి స్టార్టింగ్ లోనే ఏర్పడింది. అంతమాత్రమే కాకుండా టిడిపిలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లిపోవాలని ముందు భావించగా జగన్ రాజీనామా చేయాలని షరతు పెట్టడంతో.. సైలెంట్ అవ్వడం జరిగింది.
ఇటువంటి తరుణంలో తన సీనియారిటీ తో కొద్దోగొప్పో మెల్లగా టిడిపి బండిని లాగిస్తున్న చంద్రబాబు మళ్లీ పార్టీని యధావిధిగా యాక్టివ్ చేయడానికి అనేక కమిటీలు వేస్తూ క్యాడర్ కిపదవులను అప్పగిస్తూ రాణిస్తున్నారు. అయితే ఇటీవల పార్టీ పార్లమెంట్ కమిటీలను నియమించి పదవులను అప్పగించిన తరుణంలో ఎప్పటినుండో ఉన్న సీనియర్లకు మరియు పదవులు అప్పగించిన కొంతమంది జూనియర్లకు మధ్య వివాదాలు నెలకొనడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.
ఇప్పుడు ఇదే రీతిలో ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి మారింది అనే టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. విషయంలోకి వెళితే ప్రకాశం జిల్లాలో టిడిపి పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువై పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల పార్టీ తరఫున ప్రకటించిన పదవులు చాలావరకు కొత్తవారికి ఇవ్వటంతో సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి చూపించడంతో సీనియర్లు- జూనియర్లు కు మధ్య భారీ స్థాయిలో వివాదాలు నెలకొన్నట్లు జిల్లా రాజకీయాల్లో టాక్ వస్తోంది.బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దామ చర్ల జనార్దన్ కి ఎన్నికల సమయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వగా…2019 ఎలక్షన్లో పార్టీని గెలిపించడం లో విఫలం కావడంతో, ఆయనను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా జిల్లా నుండి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నాగాని వారిలో ప్రస్తుతం సఖ్యత లేకపోవడంతో పాటు మరోపక్క పార్టీకి అండగా ఉన్న చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో.. ప్రకాశం జిల్లాలో టిడిపి పార్టీ పునాదులు కదిలి పోయినట్లే అన్న టాక్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినబడుతోంది. చాలావరకు జిల్లా లో అనుభవం లేని వారికి బాబు పార్టీ పదవులు కట్టబెట్టడం తో.. టిడిపిలో ఉన్న సీనియర్లకు వీళ్లకు సరైన అండర్ స్టాండింగ్ లేకపోవడంతో ప్రకాశం జిల్లా టిడిపి క్యాడర్ లో గ్రూపు రాజకీయాలు భారీ స్థాయిలో ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ వస్తోంది.