రాజమండ్రి, ఫిబ్రవరి 21: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రాజమండ్రికి చేరుకున్నభారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి.
అమిత్షా పర్యటనను వ్యతిరేకిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్లేకార్డులతో నిరసన తెలియజేశారు. అమిత్షా గోబ్యాక్, ఉయ్ వాంట్ స్పెషల్ స్టాటస్ అంటూ నినాదాలు చేశారు.
నిరసన తెలియజేస్తున్న టిడిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
రాజమండ్రి క్వారీ సెంటర్లో అమిత్ షా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సి సోము వీర్రాజు తదితర నేతలు పాల్గొన్నారు.
అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో అమిత్షా ప్రసంగించనున్నారు.