అమరావతి: ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం తీవ్రంగానే ఉందని రాజమండ్రి పార్లమెంట్ టిడిపి అభ్యర్థి మాగంటి రూప అన్నారు. టిడిపి నియోజకవర్గాల వారీ సమీక్షా సమావేశంలో హజరయ్యేందుకు శనివారం ఇక్కడకు విచ్చేసిన మాగంటి రూప మీడియాతో మాట్లాడారు.
రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలనూ టిడిపి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం తీవ్రంగా ఉందంటూ రూప వ్యాఖ్యానించారు.
జనసేన ప్రభావం తాము ఊహించుకున్నదానికంటే ఎక్కువగానే ఉందనీ అయితే జనసేన కారణంగా ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందన్న విషయం తేలాల్సి ఉందని రూప అన్నారు.
గతంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ పోలింగ్ నమోదు కాలేదనీ అందుకే గెలుపుపై ధీమాగా ఉన్నామని మాగంటి రూప తెలిపారు.