తెలుగు రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పటంలో సొంత పార్టీ అయినా ఇంకా ఎలాంటి విషయమైనా ముందుండి రాజకీయ నేతల్లో ఒకరు టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అప్పట్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటూ టిడిపి ఎంపీలు పార్లమెంటు పరిధిలో అనేక రీతులుగా ధర్నాలు చేస్తున్న సమయంలో సొంత పార్టీకే కౌంటర్లు వేస్తూ ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అంటూ జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం అప్పట్లో సొంత పార్టీని ఇరుకున పెట్టే విధంగా చేశాయి.
2019 ఎన్నికల్లో పోటీచేసిన జెసి దివాకర్ రెడ్డి ఓడిపోవడంతో ప్రస్తుతం రాజకీయంగా ఇంకా అనేక రీతులుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక కేసులలో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల పోలీసులపై కూడా నోరు పారేసుకోవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పై తీవ్రస్థాయిలో జెసి దివాకర్ రెడ్డి మండిపడ్డారు.
చంద్రబాబు లో లోపాలను ఎన్నోసార్లు ఎత్తిచూపిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఆయన మారకపోతే మరోసారి జగన్ చేతిలో చావుదెబ్బ తప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. మార్పు రావటం కష్టమే అన్నట్టుగా ఉన్నట్లు భవిష్యత్తులో కూడా రాదు అన్నట్టు వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలలో సీనియర్ అయిన మాత్రాన పార్టీలో మిగతా వారిని అలా చూడకూడదని.. నేను ఆయనతో పాటు సమాన రాజకీయాలు చేయడం జరిగింది. మమ్మల్ని కూడా చిన్న పిల్లలు లాగా చూస్తే ఎలా? ఈ విషయంలో ఆయన ఎంత త్వరగా మారితే అంత మేలు పార్టీకి జరుగుతుంది అంటూ స్పష్టం చేశారు.