TDP: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై ఇప్పటి వరకూ టీడీపీ అసెంబ్లీలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో కల్తీ సారా తాగి ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం సహజ మరణాలు అంటూ తప్పుడు సమాచారం ఇస్తోందంటూ టీడీపీ మండిపడుతోంది. కల్తీ సారా మరణాలపై చర్చించాలంటూ ఉభయ సభల్లో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం చర్చకు అంగీకరించలేదు. దీంతో టీడీపీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో కల్తీ సారా ఏరులై పారుతున్నా, కల్తీ మందు తాగి ప్రజలు చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ మండిపడుతోంది. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న కల్తీ సారా, మద్యం షాపుల్లో జే బ్రాండ్ మద్యం అమ్మకాలపై నిషేదం విధించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చింది. ఈ నెల 19, 20 (రేపు, ఎల్లుండి) తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపడుతున్నారు.
కల్తీ సారా వల్ల చాలా మంది మరణించారని టీడీపీ ఆరోపిస్తుండగా, వాళ్ల మరణాలకు కల్తీ సారా కారణం కాదనీ, సహజ మరణాలు, ఇతర కారణాలతో చనిపోయినా టీడీపీ శవరాజకీయం చేస్తోందంటూ వైసీపీ పేర్కొంటోంది. మంత్రులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతల బృందం ఇటీవల జంగారెడ్డిగూడెం వెళ్లి బాదిత కుటుంబాలను పరామర్శించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?