ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చేత ఆమోదం పొందిన మూడు రాజధానులు బిల్లుని మండలిలో ఎంతో చాకచక్యంగా అడ్డగించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆ బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర పడడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. తమ భూములు కొనిపెట్టుకున్న అమరావతి మాత్రమే రాజధాని గా ఉండాలి అంటూ టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ ఆమోదముద్ర వేయడని టిడిపి ఏ మూలో చిన్న ఆశ పెట్టుకొని ఉన్నట్టున్నారు.అయితే నిమ్మగడ్డ నియామకం హైకోర్టు నుంచి వచ్చిన డైరెక్ట్ ఉత్తర్వులు కాబట్టి గవర్నర్ వేరే దారిలేక జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించాడు. కానీ అందరూ అనుకున్నట్టే చివరికి మూడు రాజధాని విషయమై పాజిటివ్ గా స్పందించాడు.
ఇక ఇప్పుడు గవర్నర్ నిర్ణయం పై తాము హైకోర్టుకు వెళ్ళబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించారు. గవర్నర్ నిర్ణయం పై హైకోర్టులో టిడిపి వారు పిటిషన్ వేయనున్నారు.ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయాలకు సంబంధించి చాలాసార్లు హైకోర్టును ఆశ్రయించిన టిడిపి తాజాగా రాజధాని అంశంపై కూడా కోర్టు మెట్లు ఎక్కబోతోంది.
ఇక పిటిషన్ వేసిన తర్వాత అంకం ఆ బిల్లు విషయంలో వారు గవర్నర్ కు వ్యతిరేకంగా లేవనెత్తే పాయింట్. బిల్లు మండలిలో పెండింగ్ లో ఉంది.. దాన్ని గవర్నర్ అయినా ఎలా ఆమోదిస్తారు అన్నది తెలుగుదేశం పార్టీ వాదన.హై కోర్టులో ఈ వాదన చెల్లకపోవచ్చు. ఎందుకంటే మండలికి ఏ బిల్లు వచ్చినా కూడా కొద్ది రోజుల పాటే పెండింగ్ లో ఉంటుంది. ఆ తర్వాత ఆమోదం పొందినా.
పొందకపోయినా అసెంబ్లీ ఆమోదిస్తే చాలు అని రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ మొన్న వ్యూహాత్మకంగా రెండో సారి అసెంబ్లీలో బిల్లుని పెట్టి మండల కి తరలించారు. ఇక అప్పట్లో ఎలాంటి సెలెక్ట్ కమిటీ కార్యరూపం దాల్చని నేపథ్యంలో టిడిపికి ఈసారి మాత్రం హైకోర్టు దగ్గర నుండి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.