Maganti : పశ్చిమగోదావరి జిల్లాలో కీలక ఎంతో పలుకుబడి ఉన్న రాజకీయ కుటుంబం మాగంటి కుటుంబం. కొన్ని దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాల్లో కీలకంగా రాణించిన ఈ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించగా విభజన జరిగిన తర్వాత టీడీపీ లో ప్రస్తుతం రాణిస్తూ ఉంది. 2014 ఎన్నికలలో ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా మాగంటి బాబు ఈ కుటుంబం నుండి గెలవగా .. ఆయన తనయుడు..మాగంటి రాంజీ టిడిపి అధికారంలో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. జిల్లా రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్నారు.
అటువంటిది ఆయన ఇటీవల అనారోగ్యానికి గురి కావడం తో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ లో ఇటీవల జాయిన్ చేయడం జరిగింది. రాంజీ ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే రాంజీ అనారోగ్యానికి కారణం ఏమిటి అన్న దానిపై రకరకాల వార్తలు రాగా.. చాలా వరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం జోరుగా జరిగింది. కానీ దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కుటుంబం నుండి రాలేదు. ఇలాంటి తరుణంలో నారా లోకేష్ మాగంటి కుటుంబ సభ్యులను .. రాంజీ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని వివరాలు ఇటీవల తెలుసుకోవడం జరిగింది. ఈ తరుణంలో కచ్చితంగా మాగంటి రాంజీ పూర్తిగా కోలుకుని వస్తారని..అంతవరకు పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇవ్వటం జరిగింది. అయితే తాజాగా ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. రాంజీ మరణంతో కుటుంబ సభ్యులతో పాటు పశ్చిమ గోదావరి టీడీపీ శ్రేణులలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద వయసు కూడా లేకపోవడంతో చిన్న వయసులోనే ఆయన మరణించడంతో.. చాలా రాజకీయ భవిష్యత్తు ఉన్న టైంలో రాంజీ మరణం.. ఆయన కుటుంబానికి తీరని లోటు అంటూ..తాజా వార్త పై జిల్లా రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.