Teachers: జగన్ ప్రభుత్వంతో లాలూచీ పడి పీఆర్సీ సాధన సమితి నేతలు ‘ఆ నలుగురు’ ఉద్యమాన్ని నీరుకార్చారని ఉపాధ్యాయులు ఫైర్ అవుతు న్నారు.ఇందుకు నిరసనగా ఆ నేతల ఫోటోలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.అలాగే బాహుబలి లో కట్టప్ప వెన్నుపోటు దృశ్యాన్ని వారికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.వారిని ఉద్యమ ద్రోహులు,చీకటి నాయకులుగా టీచర్లు గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
Teachers: కొద్దిగా వెనక్కు వెళితే!
జగన్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని,దీనికి సంబంధించి వెలువడిన జీవోలను నిరసిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు సోమవారం నుండి సమ్మెకు సిద్ధపడ్డారు.ఇందులో భాగంగా కలెక్టరేట్ల ముట్టడి,ఛలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహించగా అవి ఎవరూ ఊహించని రీతిలో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా విజయవంతం అయ్యాయి.చివరికి చలో విజయవాడ కార్యక్రమాన్ని చూసి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనకు చలి జ్వరం వచ్చిందని అవుతుందని ట్వీట్ చేయడం కూడా తెలిసిందే
దిగివచ్చిన ప్రభుత్వం
దీంతో ప్రభుత్వం దిగివచ్చి మళ్లీ చర్చలకు కలవగా పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు,బొప్పరాజు వెంకటేశ్వర్లు,కేఆర్ సూర్యనారాయణ,ఏ వెంకట్రామిరెడ్డి వాటికి హాజరయ్యారు.ఈ చర్చల్లో కంటితుడుపు చర్యగా కొన్ని ప్రభుత్వ ప్రతిపాదనలకు వారు ఆమోదం తెలిపారు.దీనికి సంతృప్తి చెంది సమ్మె విరమిస్తున్నామని,సయోధ్య కుదిరిందని వారు ప్రకటించారు.
ముఖ్యమంత్రి జగన్ కు ఆ నలుగురు నేతలు కృతజ్ఞతాభి వందనాలు సమర్పించారు.ఆవేశంలో వున్న ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఒకవేళ ఏదైనా దూషణ చేసినా పట్టించుకోవద్దని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి కూడా చేశారు. సోమవారం జగన్ కు సన్మానం చేయడానికి వారు సిద్ధమయ్యారు
Teachers: జగన్ నీరో… సాధించింది జీరో!
అయితే తమ ప్రధాన డిమాండ్లు ఏవీ నెరవేరలేదని,ప్రభుత్వం విసిరిన తాయిలాలకు సంతృప్తి చెంది పీఆర్సీ సాధన సమితి నేతలు సమ్మెను అటకెక్కించారని ఉపాధ్యాయ సంఘాలు ఆవేశంతో ఊగిపోతున్నాయి.ఈ నలుగురు తమ ప్రయోజనాలు చూసుకొని మిగతా వారిని కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వారు తమ ఆవేశాన్ని వెళ్లగక్కుతూ వారు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు.అవసరమైతే ఉపాధ్యాయుల వరకు సమ్మె చేసే యోచనలో కూడా ఉన్నారు.కాగా వీరిలో బొప్పరాజు వెంకటేశ్వర్లు,బండి శ్రీనివాసరావు ప్రకాశం జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.