సికింద్రాబాద్లోని ఆర్ కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పీఆర్ టీ, పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీలు, అర్హతలు, ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీలు: 54
ప్రైమరీ టీచర్లు( పీఆర్ టీ) :28పోస్టులు
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ( టీజీటీ) : 17పోస్టులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్( పీజీటీ) :09పోస్టులు
ప్రైమరీ టీచర్లు( పీఆర్ టీ) :
ఖాళీలున్న సబ్జెక్టులు : అన్ని సబ్జెక్టులు, పిటిఐ, మ్యూజిక్, డాన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ( టీజీటీ) :
ఖాళీలున్న సబ్జెక్టులు :
సోషల్ సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, బయోలజీ.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్( పీజీటీ) :
ఖాళీలున్న సబ్జెక్టులు :
ఇంగ్లీష్, కెమిస్ట్రీ, సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, బయాలజీ, హిస్టరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్.
అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ తో పాటు బీఈడీ ఉత్తీర్ణత, ఏడబ్ల్యూఈఎస్, సిఎస్బి పరీక్ష, 60% మార్కులతో సీటెట్,టెట్ అర్హత తప్పనిసరి.
వయసు : 40 ఏళ్లు, 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం : ముందుగా ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ చిరునామా :
ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్ కే పురం, ఫ్లైఓవర్ దగ్గర, నేరేడ్ మెట్, తిరుమలగిరి, సికింద్రాబాద్-500056.
రుసుము : రూ.100
దరఖాస్తులకు చివరి తేదీ : 20.01.2021.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?